24-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణాల త ర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పథకం ప్ర వేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని, ఇందుకు గాను జీరో టికెట్ల రియింబర్స్మెంట్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తోందని అన్నారు. బుధవారం ఎంజీబీఎస్లో మహాలక్ష్మి- మహిళల 200 కోట్ల ఉచిత ప్రయాణ సంబురాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలు ఆదా చేసుకున్న రూ.6,680 కోట్ల చెక్ను ప్రభుత్వం తరపున మంత్రులు పొ న్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశా రు. మహాలక్ష్మి- ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మ హిళలను, ఈ స్కీమ్ను సమర్థవంతంగా అ మలు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. అనంతరం డిఫ్యూటీ సీఎం మాట్లా డారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక 2,400 కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. హైదరాబా ద్ను కాలుష్య రహిత నగరంగా మా ర్చేందు కు 2,800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టీ జీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందని తెలిపా రు. సంస్థలో ఇప్పటికే 11 శాతం ఎలక్ట్రిక్ బ స్సులున్నాయని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా రూ. 20 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు, అభివృద్ది చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక ర చిస్తోందన్నారు.
కొత్త బస్సుల కొనుగోలు: మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళల దైనందిన జీవితంలో మహాలక్ష్మి పథకం భాగమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలు 200 కోట్ల ప్ర యాణాలు చేసిన సందర్భంగా రాష్ర్టంలో ని 97 డిపోలు, 324 బస్ స్టేషన్లలో ఘనం గా వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పె రిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలుతో పాటు నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
త్వరలో కొత్త రహదారులు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తుతం 7,913 బస్సుల్లో అమలు చేస్తున్నామని, ఆయా బస్సుల్లో ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, ఖు ష్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.