17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న పాలకులు

17-04-2026 08:52 PM

- డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్

హనుమకొండ,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ విమర్శించారు.శుక్రవారం హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్‌లో జరిగిన డీవైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. యువతకు ఆశలు చూపించి మోసం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ప్రకటించలేదని అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతోందని, చదువుకున్న యువత ఉద్యోగాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు యువత సమస్యలను పక్కన పెట్టి, వాగ్దానాలతో కాలం గడుపుతున్నాయని విమర్శించారు. యువత హక్కుల కోసం డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు కొనసాగిస్తామని రమేష్ స్పష్టం చేశారు.