17-11-2025 01:15:28 AM
వలిగొండ, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం మార్నింగ్ వాకర్స్ తో వలిగొండ కొత్త బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.