30-10-2025 10:38:38 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా సిర్గాపూర్ ఎస్సై మహేష్ కోరారు. ఈ రన్ చిమల్ పాడ్ రోడ్డులో నిర్వహించడం జరుగుతుందని దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని సిర్గాపూర్ ఎస్సై మహేష్ కోరారు. ఉదయం 8:00 గంటలకు జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ప్రారంభించానున్నారు. దీనికి అందరు ఆహ్వానితులని ఎస్సై మహేష్ అన్నారు.