16 May, 2026 | 2:29 AM

207 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

16-05-2026 01:44 AM

మరిపెడ (మహబూబాబాద్) మే 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 207 బస్తాల రేషన్ బియ్యాన్ని మరిపెడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్ పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నిలువచేసిన బియ్యాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై గోదాముకు తరలించారు. సంఘటనపై విచారణ చేపట్టినట్లు ఆర్ ఐ తెలిపారు.