9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి

05-02-2025 07:26 PM

జిఎం సేఫ్టీ కార్పొరేట్ సిహెచ్ శ్రీనివాస్...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని జీఎం సేఫ్టీ కార్పొరేట్ సిహెచ్ శ్రీనివాస్ కోరారు. ఏరియాలోని కేకే ఓసిపిని బుధవారం సందర్శించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు రక్షణ సూత్రాలు పాటించి విధులు నిర్వహించాలన్నారు. నా రక్షణ నాదే బాధ్యత, అలాగే నా రక్షణ నా కుటుంబ బాధ్యతగా బావించి  స్వతహాగా రక్షణ పొందాలన్నారు. పని స్థలాలలో తొందరపాటుతనంతో చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతాయన్నారు. పని స్థలాలను నిశితంగా పరిశీలించిన అనంతరమే విధులు నిర్వహించాలని సూచించారు.

సూపర్వైజర్లు ముందుగా పని స్థలాలను పర్యవేక్షించిన అనంతరం పనులు అప్పగించాలన్నారు. ప్రతి ఒక్కరు సంస్థ తమదనే భావనతో పని చేస్తే ప్రగతి ఫలాలు విరబూస్తాయని స్పష్టం చేశారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఈ సందర్భంగా కేకే ఓసిపికి వచ్చిన సేఫ్టీ జియం కార్పొరేట్ కు ఏరియా జిఎం దేవేందర్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘుకుమార్, కేకే ఓసిపి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.మల్లయ్య, ఏఎస్ఓ ఎంరవీందర్, ఇంచార్జ్ కేకే ఓసిపి ప్రాజెక్ట్ ఇంజనీర్ సురేష్, ఇన్చార్జి మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ కుష్వాలు పాల్గొన్నారు.