22 April, 2026 | 7:36 AM

కుబీర్ ఎంపీడీవో గా సాగర్ రెడ్డి

01-05-2025 08:12 PM

బైంసా (విజయక్రాంతి): బైంసా డివిజన్లోని కుబీర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా టీ సాగర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన నవనీత్ కుమార్ అక్కడి నుండి బదిలీ చేసి మామిడాలో ఎంపీ ఈవో గా విధులు నిర్వహిస్తున్న సాగర్ రెడ్డికి కుబీర్ ఎంపీడీవో గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కార్యాలయంలో మండల అధికారులు ఆయనను సన్మానం చేశారు.