1 July, 2026 | 7:59 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

రేపు బసవ జయంతి శోభాయాత్ర

01-05-2025 08:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): బసవ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వీరశైవ లింగాయత్ సంఘం ఆదరణ బసవ జయంతి శాంతి శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు మారుతి పటేల్ పాండురంగ సాయి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జయంతి ఉత్సవాలను వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని కడ్డ హోటల్ చౌరస్తా నుండి వీరశైవ లింగాయత్ శోభాయాత్ర ప్రారంభించి నరసింహ నగర్ వరకు కొనసాగుతుందని సంప్రదాయ పద్ధతిలో భాజా భజంత్రీలు లింగ పూజతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. విశ్వగురు బసవేశ్వర్ అభిమానులు వీరశైవ లింగయ్య సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని వారు పిలుపునిచ్చారు.