calender_icon.png 16 June, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతికొచ్చిందే జీతం!

16-06-2025 12:59:29 AM

  1. చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 
  2. మూడు నెలలు గడుస్తున్నా రెన్యువల్ కాని ఫైల్ 
  3. జీతాలు రాక ఉద్యోగం ఉందో లేదో తెలియక బాధలు 
  4. మరోవైపు వచ్చే జీతంలో కోతపెడుతున్న కాంట్రాక్టర్లు.. 
  5. ఎన్నికల హామీని పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు
  6. సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటున్న ఉద్యోగులు

బిస్వాల్ కమిటీ, సుప్రీం సూచనలు

* 2020లో బిస్వాల్ కమిటీ సూచనల ప్రకారం ఉద్యోగి జీతం కేటగిరీల వారీగా రూ.19,000, -రూ.22,900, రూ. 31,040గా పేర్కొన్నారు. 

* ప్రతి ఉద్యోగికి ఏటా రూ.1,000- ఇంక్రిమెంట్ ఇవ్వాలని సూచించారు. 

* సుప్రీంకోర్టు జీవో నెం.17, 2017 ఆదేశాల ప్రకారం ఒక ఉద్యోగి అదే శాఖ లోని ప్రభుత్య ఉద్యోగితో సమానపని చేస్తున్నపుడు వేతనంలో వ్యత్యాసం చూపడం అనేది శ్రమ దోపిడీ అని అందుకే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని పేర్కొంది. 

* కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలన్నీ ఈ ఆదేశాలను బేఖాతరు చేశాయి. సుప్రీం జీవో నెం.17 ప్రకారం ఇచ్చిన మిని మం మొదటి క్యాటగిరీ రూ.19,000 ఎక్కడా అమలు కావడం లేదు.

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యో గుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఏళ్లుగా పనిచేస్తున్నా చాలీచాలని వేతనాలతో బతుకుబండిని లాగుతూ వస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంగ్రె స్ సర్కారుపై పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరవుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కారు నేటికీ ఆ దిశ గా కనీసం అడుగులు కూడా వేయడం లేదని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి కాపా డాలని కోరుతున్నా సర్కారు కరుణించడం లేదని అంటున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు పైసా ఖర్చయ్యే పరిస్థితి లేకు న్నా ప్రభుత్వం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఈ చిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ఏటా ముగిసే కాంట్రాక్టు ముగి సినా ప్రభుత్వం నేటివరకు రెన్యువల్ చేయకపోవడంతో గత 2 నెలలుగా జీతా లు లేక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అలమటిస్తున్నారు. ఇప్పటికీ రెన్యువల్ ఫైల్‌ను కదిలించాల్సిన ప్రభుత్వం స్పందించకుం డా ఉండటంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటివరకు తమ బతుకులు మారడం లేదని అంటున్నారు. 

 వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేక, చాలీచాలని జీతాలతో బతుకలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని పోరాటం చేసి రాష్ట్రం సాధించుకుంటే తెలంగాణలోనూ తమకు న్యాయం జరగలేదని..

అదే విడిపోయిన ఏపీలో మాత్రం ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల పీడ విరగడ చేశారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంటున్నారు. ఏపీలో నెలనెలా నేరుగా కార్పొరేషన్ ద్వారా పైసా కటింగ్ లేకుండా వేతనాలు ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం కాంట్రాక్టర్ల దోపిడీతో చేతికి వచ్చిందే జీతం అన్న రీతిలో పరిస్థితి మారిపోయిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంటున్నారు.

బడుగుజీవుల పొట్టకొడుతున్న ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ..

ఔట్ సోర్సింగ్ వ్యవస్థ కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు తప్ప..నెలంతా కష్టపడి పనిచేసే చిరుద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండటం లేదు. రాష్ర్టంలో ఎందరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ సర్కారు ఈ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు.

తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంబంధిత ఉద్యోగుల జీవితాలను మార్చేస్తామని చెప్పినా అదంతా హామీగానే నిలిచిపోయింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని ఆశించినా కనీసం చర్చ కూడా జరగలేదని అంటున్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు రాష్ట్రంలో సుమారు 700 వరకు ఉన్నాయి. వీరి పరిధిలో సుమారు 2 లక్షల మందికిపై పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఏజెన్సీలు ఉద్యోగులకు నెలలు తరబడి  వేతనాలు చెల్లించకుండా, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి కూడా ఉద్యోగి ఖాతాలో జమచేయకుండా వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. పైపెచ్చు వారికి ఇచ్చే వేతనాల్లోనూ ఇష్టాను సారంగా కోతపెడుతున్నా ప్రశ్నించే పరిస్థితి లేదు.

ప్రశ్నిస్తే మరుసటిరోజు నుంచి ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని హుకుం జారీ చేస్తూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. అప్పటికే పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని తొలగిస్తే ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేందుకు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

సమాన పనికి సమాన వేతనమేది..

రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉ ద్యోగులకు నెలకు రూ.10వేల నుంచి రూ.22,500 వరకు నెల వేతనంగా అందుతున్నది. ఇచ్చిన దానితో కడుపునింపుకొనే వారికి ఏడెనిమిది నెలలుగా ఏజెన్సీలు వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నెల తిరిగే సరికే పిల్లల స్కూలు ఫీజులు, ఇం టిఖ ర్చులు, వైద్యం, ఇతర ఖర్చుల నేపథ్యంలో జీవితం భారం గా మారి ఇబ్బంది పడుతున్నారు.

చేసిన అప్పులు సకాలంలో చెల్లించకపోవడంతో మరోసారి అప్పు పుట్టని పరి స్థితి కొంతమంది కుటుంబాలను పోషించలేక ఆర్థికభారం తో తనువు చాలించిన పరిస్థితులున్నాయి. నెలకు రూ. ల క్షకు పైగా జీతం తీసుకునే రెగ్యులర్ ఉద్యోగులు వచ్చి సం తకాలు పెట్టి వెళ్తుంటే భారం తాము మోస్తున్నా కనీసం రూ.15వేల వేతనం కూడా లభించడం లేద ని వైద్యశాఖలో పనిచేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వాపోయారు. 

ఏజెన్సీలు రద్దు చేస్తే సర్కారుకే లాభం..

ప్రభుత్వం కనీస వేతనంగా రూ.15,600, పీఎఫ్ రూ.2,028, ఈఎస్‌ఐ రూ.507, ఏజెన్సీ కమీషన్ రూ.624 మొత్తం కలిపి రూ.18759 చెల్లిస్తోంది. ఇందుకుగాను నెలకు 18శాతం జీఎస్టీ రూపంలో రూ.3,377 చెల్లిస్తోంది. ఇందులో పీఎఫ్ ఎంప్లాయి షేర్ రూ.1,872, ఈఎస్‌ఐ రూ.117 కలిపి రూ.1,989 నెలనెలా కట్ చేసి ఉద్యోగికి రూ.13,611 చెల్లించాలి. కానీ రూ.1,989 కట్ చేస్తున్నా ఏజెన్సీ వాటికి జమచేయకుండా తన జేబులో వేసుకోవడంతో ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.

అలాగే రూ.13,611కనీస వేతనం నేరుగా ఖాతా ల్లో వేయాల్సి ఉన్నా అలా చేయకుండా నెలకు రూ.10వేల నుంచి రూ.11వేల వరకు ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. దీనిపై ప్రశ్నించే వ్యవస్థే లేనందున ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిన మారింది.

ఇక ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఉద్యోగికి వేతనాలు చెల్లిస్తే 18శాతం జీఎస్టీ, 4శాతం ఏజెన్సీ కమిషన్ తప్పుతాయి. అంటే ఔట్‌సోర్సింగ్‌లో మొదటి స్థాయి ఉద్యోగి విషయం లోనే నెలకు ప్రభుత్వానికి రూ.4,001 మిగులుతుంది. ఈ మిగులును నేరుగా ఉద్యోగి ఖాతా లో జమ చేస్తే కనీసం వేతనమే రూ. 20వేలు దాటుతుంది. 

కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

రాష్ర్టంలో ఔట్ సోరి ్సంగ్ ఉద్యోగులను ఏజెన్సీ లు శ్రమదోపిడీకి గురి చేస్తున్నాయి. కనీసం పీఎఫ్, ఈ ఎస్‌ఐ డబ్బులు కూడా చెల్లించకుండా వారి జేబుల్లో వేసుకుని ఉద్యోగులను మోసం చేస్తున్నారు. వారి సంపాదనను పీఎఫ్ ఖాతాలో జమ చేయకపోవడమే కాకుండా నెలనెలా వేతనాల్లో రూ.3వేల వరకు కోత పెట్టి మోసం చేస్తున్నారు.

అందుకే రాష్ట్రంలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగ భద్రత ఇస్తూ, ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగులను ఆదుకోవాలి. దీంతో నియామక ఏజెన్సీలకు కమీషన్ల రూపంలో చెల్లించాల్సిన భారీ మొత్తాలను ప్రభుత్వం ఆదా చేసేందుకు, జీఎస్టీ చెల్లింపులను తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

 లక్ష్మయ్య, అధ్యక్షుడు, 

రాష్ట్ర ఔట్ సోర్సింగ్ జేఏసీ