calender_icon.png 16 June, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

16-06-2025 12:57:50 AM

 వేములపల్లి, జూన్ 15 : మండలంలోని సల్కునూర్ క్రాస్ రోడ్డు  వద్ద గల శ్రీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 1994- 95,  సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సల్కనూర్ క్రాస్ రోడ్ వద్ద గల ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో  సమావేశం ఏర్పాటు చేసుకొని బోధించిన గురువులను, 30 సంవత్సరాల నాటి తరగతి గదిలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఉపాధ్యాయులు బోధించిన తీరును, వారితో ఉన్న అనుబంధాలను జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరినప్పుడే పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం జిన్న వెంకట్ రెడ్డి, నంద్యాల రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జానయ్య, పరశురాములు, విద్యార్థులు నరేష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పుల్లయ్య, హాసన్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కిరణ్ రెడ్డి, యాదగిరి, కళ్యాణి ,స్వప్న, శోభ, లక్ష్మి ,విజయ ,మంజుల తదితరులుపాల్గొన్నారు.