17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దేశ ఐక్యతకు ప్రతీక సర్ధార్ వల్లభభాయ్ పటేల్

31-10-2025 01:39 PM

జయంతి సందర్భంగా 2కె రన్ లో ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుండి మినీ ట్యాంక్‌బండ్‌ వరకు సుమారు 2కె దూరంలో రన్ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత పటిష్ఠంగా నిలవాలంటే ప్రతి పౌరుడు సర్ధార్ పటేల్ చూపిన మార్గంలో నడవాలన్నారు.  ఐక్యతలోనే శక్తి ఉందని ఆయన తన జీవితంతో నిరూపించారని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని మార్మోగించారు.