3 September, 2026 | 11:23 AM

24 గంటల్లోనే రెండో హత్య.. మైలార్‌దేవ్‌పల్లిలో కలకలం

03-09-2026 | 10:08am

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్(Mailardevpally Police Station) పరిధిలో వరస హత్యలు కలకలం రేపుతున్నాయి. అలీనగర్‌లో బుధవారం రాత్రి అబ్దుల్ రవూఫ్ అనే ఆటో డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, జహంగీరాబాద్‌కు చెందిన రవూఫ్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(Rajendranagar Deputy Commissioner of Police) ఎస్. శ్రీనివాస్, నిందితులను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి పల్లెచెరువులో(Pallecheruvu) జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారని పేర్కొన్న శ్రీనివాస్, రవూఫ్ హత్యలో ప్రమేయం ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇకపై రాత్రి వేళల్లో వ్యక్తుల కదలికల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి లోపే దుకాణాలు మూసివేయబడేలా చూస్తామన్న ఆయన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రెండు హత్యలు జరగడంతో మైలార్‌దేవ్‌పల్లి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.