09-12-2025 12:00:00 AM
పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): ప్రజా శాంతిని కాపాడటానికి మరియు బోధన్ రెవెన్యూ మండలాల్లో ( బోధన్ రూరల్, చందూర్ , కోటగిరి , మోస్రా , పోతంగల్ , రెంజల్ , రుద్రూర్ , సాలూరా , వర్ని , ఏడపల్లి , బోధన్ డివిజన్ నిజామాబాద్ డివిజన్ నవీపేట్) ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పైన పేర్కొన్న ప్రాంతాలలో U/S 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని నిజామాబాద్ సిపి తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు.
సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలనీ తన ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 09.12.2025 ఉదయం 05:00 గంటల నుండి 12.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అమలులో ఉంటుందని, పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు కుంటామని నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.