31-05-2025 12:00:00 AM
టీఎల్ఎం మేళాను ప్రారంభించిన డీఈఓ శ్రీనివాస్ రెడ్డి
అదిలాబాద్, మే 30 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు శిక్షణా కాలంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో పాటిస్తూ నాణ్యమైన విద్యా బోధన జరిగేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హిందీ హైస్కూల్లో గురువారం జరిగిన హిం దీ భాష టి.ఎల్.ఎం మేళా ను డీఈఓ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెండో విడత ఐదు రోజుల పాటు జరిగిన హిందీ ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా ప్రతిభ కనబరి చిన హిందీ ఉపాధ్యాయులకు డీఈఓ ప్రతిభ పురస్కారాలను అందించారు. టిఎల్ఎంలో ప్రథమ బహుమతి జైనథ్ మండల్, ద్వితీ య బహుమతి ఆదిలాబాద్ రూరల్, తృతీ య బహుమతి సాత్నాల మండలాల ఉపాధ్యాయులు అందుకోగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల మేళాను,
హిందీ భాషకు సంబం ధించిన చార్టుల ప్రదర్శనను డీఈఓ ఆసక్తిగా తిలకించగా, ఉపాధ్యాయులు వారు తయారుచేసిన అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, కార్యవర్గ సభ్యులు మహేష్, సాంబన్న, భాస్కర్, చంద్రశేఖర్, అంబేద్కర్ కోర్స్ డైరెక్టర్ లచ్చి రాం, ఎస్.ఆర్.పి వినాయక్, డిఆర్పీలు జాకీ ర్ హుస్సేన్, జావేద్ అలీ, గోమంత్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.