calender_icon.png 3 December, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని సింధు ఎంపిక

03-12-2025 10:04:13 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో పదో తరగతి చదువుతున్న కే సింధు అంతర్జాతీయ వాలీబాల్ టీంకు కెప్టెన్ గా ఎంపికైంది. ఆమె ఇటీవల పూణేలో జరిగిన ఎస్ జి ఎఫ్ ఐ జాతీయస్థాయి వాలీబాల్ ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమె జాతీయస్థాయి వాలీబాల్ కెప్టెన్ గా ఎన్నికయింది. సింధూను అంతర్జాతీయ స్థాయిలో వాలిబాల్ ఆడేందుకు భారతదేశ వాలీబాల్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కే సంధ్యారాణి, సిబ్బంది ఆమెను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి చదువుతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే, పాఠశాలకు కళాశాల గుర్తింపు లభిస్తుందని అన్నారు.