17-04-2025 12:51:22 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(విజయక్రాంతి) : నిజాం కాలేజీలో డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుద చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థుల నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాధాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేయకుంటే ఏప్రిల్లో పీజీ ఎంట్రేన్స్ పరీక్షలకు తాము ఎలా హాజరు కావాలని డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రశ్నించారు. తమ జీవితాలతో చెలగాటమాడొద్దని విమర్శించారు. ప్రిన్సిపాల్ రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు.