15 June, 2026 | 11:42 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

24-11-2025 06:15 PM

బాలీవుడ్ హీ-మ్యాన్ ఇక లేరు

ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(Dharmendra Passes Away) కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ధర్మంద్ర నవంబర్ 12న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్(Breach Candy Hospital) నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఇంట్లో బాగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి నుండి డాక్టర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ, అవసరమైన చికిత్స పొందిన తర్వాత ఆ దిగ్గజ నటుడు పూర్తి సంతృప్తితో ఇంటికి వెళ్ళారని అన్నారు. ధర్మేంద్ర సోమవారం నాడు ముంబయిలోని నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్ లోలోని లూథియానా జిల్లా నస్రాలిలో జన్మించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్. 1954లో 19 ఏళ్ల వయస్సులో ప్రశాశ్ కౌర్ తో ధర్మేంద్ర తొలి వివాహం జరిగింది. 1980లో హేమామాలిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం ఉన్నారు. బాలీవుడ్ హీమ్యాన్(Bollywood He-Man)గా ధర్మేంద్రకు గుర్తింపు లభించింది. షోలే బ్లాక్ బస్టర్ తో ధర్మేంద్రకు స్టార్ డమ్ అందుకున్నారు. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే సినిమాతో ధర్మేంద్ర తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. 2004లో రాజస్థాన్ బికనీర్ నుంచి ధర్మేంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2012లో ధర్మేంద్రకు పద్మభూషన్ వరించింది. 1997లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.