calender_icon.png 19 February, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ రోహిత్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోతిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి

19-02-2026 12:33:46 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ను లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలంలో పారిశ్రామిక వాడలుగా పేరుగాంచిన సారపాక,లక్ష్మీపురం ప్రాంతాలలో పెరుగుతున్న వ్యాపార, వాణిజ్య, రవాణా, అధిక జనాభా దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.

సారపాక, గాంధీనగర్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మాక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని, సమాజ బాధ్యతగా స్థానికులుగా తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు.ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజ్ స్పందించి జిల్లా పోలీస్ వ్యవస్థ నుండి ప్రజావసరాలకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, ఆదర్శ రైతులు యారం లక్ష్మీరెడ్డి,మేడిపల్లి ఉదయ్ పాల్గొన్నారు.