10-01-2026 01:00:02 AM
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 9: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)నుంచి మినహాయింపు ఇవ్వాలని,ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఐకాసా పిలుపుమేరకు శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపురం ప్రాథమిక,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.