13 April, 2026 | 1:31 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

రైల్వే ట్రాక్ ట్రాలీ ప్రమాదం.. ఏడుగురు సన్యాసులు మృతి

25-09-2025 09:49 AM

కొలంబో: వాయువ్య శ్రీలంకలోని(Sri Lanka cable cart accident) ఒక అటవీ ఆశ్రమం వద్ద కేబుల్‌తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఒక భారతీయుడితో సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. ఈ సంఘటన బుధవారం రాత్రి కొలంబో నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నికావెరాటియాలో ఉన్న ప్రఖ్యాత బౌద్ధ ఆశ్రమం అయిన నా ఉయనా అరణ్య సేనసనయలో వద్ద జరిగింది. ఈ ఆశ్రమం ధ్యాన విహారాలకు ప్రసిద్ధి చెందింది.

ప్రపంచవ్యాప్తంగా అభ్యాసకులను ఆకర్షిస్తుంది. మరణించిన ఏడుగురు సన్యాసులలో ఒక భారతీయుడు, ఒక రష్యన్, ఒక రొమేనియన్ జాతీయుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం కేబుల్ తెగిపోయిందని, అధిక వేగంతో రైలు బోగీ కిందికి దిగి, పట్టాలు దూకి చెట్టును ఢీకొట్టిందని తెలుస్తోంది. ఈ మఠం రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 130 కిలోమీటర్లు (81 మైళ్ళు) దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.