13 April, 2026 | 11:51 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

తెలంగాణ గ్రూప్-1.. తుది ఫలితాలు విడుదల

25-09-2025 10:00 AM

14 ఏళ్ల తర్వాత నెరవేరిన కల

తెలంగాణలో గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.

బుధవారం అర్ధరాత్రి తర్వాత ఫలితాలు విడుదల 

మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపిక.

గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంక్.

హైదరాబాద్: గ్రూప్-1 తుది ఫలితాలు(Telangana PSC Group-I results) విడుదలయ్యాయి. 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్‌సీ ప్రకటించింది. కోర్టు వివాదం నేపథ్యంలో ఒక పోస్టు ఫలితాలన్ని విత్ హెల్డ్ లో పెట్టింది. గ్రూప్-1 తుది ఫలితాల్లో లక్ష్మీ దీపిక(హైదరాబాద్)కు తొలి ర్యాంక్, దాడి వెంకటరమణకు రెండో ర్యాంక్, వంశీకృష్ణారెడ్డికి 3వ ర్యాంక్, జిన్నా తేజస్వినికి 4వ ర్యాంక్, సిదాల కృతిక 5వ ర్యాంక్, హర్షవర్ధన్ కు 6వ ర్యాంక్, కె. అనూషకు 7వ ర్యాంక్, ఏరెండ్ల నిఖితకు 8 వ ర్యాంక్, కె, భవ్యకు 9వ ర్యాక్, శ్రీకృష్ణసాయికి 10 వ ర్యాంక్ వచ్చింది. మల్టీ జోన్-1 258, మల్టీజోన్-2లో 304 మంది అధ్యర్థులు ఎంపికయ్యారు. టాప్ 10 ర్యాంకర్లు ఆర్డీవో పోస్టులకు ఆప్షన్ ఇచ్చారు.