calender_icon.png 29 June, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నమెంట్ ప్లీలీడర్ గా శ్యాం గోపాల్ రావు

28-06-2025 11:51:45 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కోర్టులకు ప్రభుత్వ లీడర్ గా సీనియర్ న్యాయవాది కామారెడ్డికి చెందిన శ్యామ్ గోపాల్ రావు ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 నుంచి న్యాయవాదిగా కామారెడ్డిలో పనిచేస్తున్నారు. సివిల్, క్రిమినల్ వాదిస్తున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా అదనపు కోర్టు పిపి గా పని చేశారు. బార్ అసోసియేషన్  అధ్యక్షుని గా పని చేశారు. ఇప్పటికి 80 సార్లు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భావం నుంచి మొదటిసారి కామారెడ్డి జిల్లా కోర్టు  ప్లీడర్ శ్యాం గోపాల్ రావు నియామకమయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు, ప్రముఖులు, అభినందించారు. ప్రభుత్వ ప్లీడర్ గా నియామకం కోసం కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.