ఎస్సెస్సీ ఫలితాల్లో సిద్ధార్థ విజయభేరి

02-05-2024 01:17:22 AM

కరీంనగర్  సిటీ, మే 1: కరీంనగర్‌లోని మంకమ్మతోట, భగత్‌నగర్ సిద్ధార్థ విద్యాసంస్థలు ఎస్సెస్సీ ఫలితాల్లో విజయభేరి మోగించారు. 32 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, 21 మంది 9.8 సాధించారు. 176 మంది విద్యార్థులు 9 ఆపై జీపీఏ సాధించారు. ఇందులో భగత్‌నగర్ క్యాంపస్ నుంచి 101 మంది విద్యార్థుల్లో.. 19 మంది 10 జీపీఏ, ఆరుగురు 9.8 జీపీఏ, 67 మంది 9 ఆపై జీపీఏలు సాధించారు.  మంకమ్మతోట క్యాంపస్ నుంచి 206 మంది పరీక్షలకు హజరుకాగా 13 మంది 10 జీపీఏ, 15 మంది 9.8 జీపీఏ, 109 మంది 9 ఆపై జీపీఏ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. మొత్తం 307 మంది పరీక్షలకు హాజరుకాగా 99 శాతం ఉత్తీర్ణతతో జయకేతనం ఎగురవేసినట్టు విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ అభినందించారు. గత 28 ఏండ్లుగా పది తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించినట్టు తెలిపారు.