29 August, 2026 | 12:39 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

త్వరలో సింగరేణి సంస్థ విదేశాల్లో అడుగుపెడుతుంది: బలరాం నాయక్

01-09-2025 09:10 AM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): త్వరలో సింగరేణి సంస్థ(Singareni company) విదేశాల్లో కూడా అడుగు పెడుతుందని సింగరేణి చైర్మన్, సిఅండ్ ఎండీ బలరాం నాయక్ తెలిపారు. సింగరేణి 55వ వార్షిక భద్రత పక్షోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి క్యాతనపల్లి స్థానిక ఎమ్ఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిఅండ్ ఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆయా సంస్థలు వేరే చోటు నుంచి బొగ్గు కొనడానికి ప్రభుత్వాలు అనుమతిస్తే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.ఈ నేపథ్యంలో నే రాజస్థాన్ లో సోలార్ ప్లాంట్లు,కర్నాటకలో బంగారు గనుల తవ్వకాలను ఇలా కొత్త మార్గాలలో అడుగు పెడుతున్నామని అన్నారు.

సింగరేణి లో రక్షణకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మరోసారి సిఅండ్ ఎండీ బలరాం నాయక్(CMD of Singareni Balaram Nayak) తెలిపారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అలాగే ఈ ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గు బొగ్గు ఉత్పత్తి సాధించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతిభ చూపిన పలు డిపార్ట్మెంట్లకు బహుమతులు అందజేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన డైరెక్టర్(ఈఎం) సత్యనారాయణ,జీఎం కో-ఆర్డినేషన్ సుభానిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ టి.ఆర్.కన్నన్, సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ,సత్యనారాయణ, గౌతం పొట్రు,వెంకటేశ్వర్లు,సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్,కార్మిక సంఘల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,జనక్ ప్రసాద్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మిపతిగౌడ్,శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.