22 July, 2026 | 3:40 PM

Breaking News

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •   NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధం: జేపీ నడ్డా   •  

శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

01-09-2025 10:44 AM
  1. మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టిన బీఆర్ఎస్ సభ్యులు
  2. రాహుల్ కు సీబీఐ వద్దు... రేవంత్ కు సీబీఐ ముద్దు
  3. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే కొనసాగుతున్న మండలి
  4.  జైతెలంగాణ నినాదాలతో హోరెత్తిన మండలి
  5. కాళేశ్వరం కమిషన్ నివేదికను చింపిన బీఆర్ఎస్ సభ్యులు

హైదరాబాద్: శాసనమండలి సమావేశాలు(Legislative Council Meetings) సోమవారం ప్రారంభం అయ్యాయి. శాసనమండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల జై తెలంగాణ నినాదాలతో మండలి హోరెత్తింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పత్రులు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సభ్యులు చించేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(PC Ghosh Kaleshwaram Commission Report) ప్రతులు చింపి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ వైపు విసిరారు. రాహుల్ కు సీబీఐ వద్దు.. రేవంత్ కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మండలి ఛైర్మన్ పోడియాన్ని బీఆర్ఎస్ సభ్యులు చుట్టుముట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మండలి కొనసాగుతోంది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.