ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
10-11-2025 06:22 PM
ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వెంకట్ సాయి లాడ్జ్ లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సోమవారం తెలిపారు. అ లాడ్జ్ లో దాదాపు ఆరుగురు పేకాట ఆడుతుండగా వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని ఈ దాడిలో 35600, ఆరు సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.






