15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పారదర్శకంగా క్వార్టర్ల కౌన్సెలింగ్

10-11-2025 06:20 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు సింగరేణి ఎన్సీడబ్యుఏ ఉద్యోగులకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సింగరేణి ఏరియా సీనియర్ పర్సనల్ అధికారి ఎం కార్తీక్ తెలిపారు. సోమవారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్లో క్వార్టర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియాలో ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు 107 క్వార్టర్ లను ప్రకటించగా, వీటికి 87 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, సీనియార్టీ ప్రకారం 18 మంది ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సీనియర్ పర్సనల్ అధికారి వంశీ, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) రాజు, ఏరియా పర్సనల్ విభాగం సిబ్బంది, ఎస్ అండ్ పిసి సిబ్బంది పాల్గొన్నారు.