2 May, 2026 | 8:26 PM

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు

02-05-2026 07:23 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ సిఐగా విధులు నిర్వహిస్తున్న గట్ల మహేందర్ రెడ్డి డీఎస్పీగా పదోన్నతి లభించిన సందర్భంగా, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ డీఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ రెడ్డి కి స్టార్ బహుకరించి అభినందించారు. కొత్తగా నిర్వర్తించే బాధ్యతల్లో మరింత ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. శాఖలో క్రమశిక్షణ, సేవా భావం, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించడం ప్రతి పోలీస్ అధికారి లక్ష్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.