23 June, 2026 | 9:48 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

07-01-2026 01:11 AM

సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ భేటీలో చర్చ

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించా రు. 8వ తేదీన గాంధీ భవన్‌లో జరిగే పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది. కేంద్రం కుట్ర పూరితంగా  మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం, పథ కం పేరు మార్చడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించారు.

కృష్ణ, గోదావరి జలాల పిపిపీ విషయంలో కూడా చర్చ. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై చ ర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విషయం లో డివిజన్, వార్డ్ ఆభ్యర్థుల ఎంపికను అ త్యంత  పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వార్డు, డివిజన్‌ల నుంచి 6 గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.