తోట ముత్యాల్లమ్మకు ప్రత్యేక పూజలు
06-08-2026 12:00 AM
సికింద్రాబాద్,ఆగస్టు 5(విజయక్రాంతి): ఆషాడ మాస బోనాలను పురష్కరించుకొని కంటోన్మెంట్లో తోట ముత్యాల్లమ్మ ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ వర్షాలు కురిసి పాడి పంటలు సమృ ద్ధిగా పండాలని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.






