21-09-2025 10:13:11 PM
పూజలో పాల్గొన్న మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి..
శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట్ మండల కేంద్రంలోని బగలాముఖి శక్తిపీఠ ఉపాసకులు శ్రీ శాస్త్రల వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమావాస్య పర్వదినం పురస్కరించుకొని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి దేవస్థానంలో మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకొని పూజలు, హోమం నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్త తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ తాజా మాజీ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ తాజా మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్ బసంపాలి పోచగౌడ్ కొవ్వురి వెంకటేష్ సీనియర్ నాయకులు బసంపల్లి రామా గౌడ్ వరగంటి రమేష్ గుప్త దొడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.