05-10-2025 12:00:00 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : శ్రీదేవి శరన్నవరాత్రుల మహో త్సవంకు ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులాబాద్ లోని జైదుర్గా భవాని కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు యుగేందర్ గౌడ్, రాజేందర్ గౌడ్, రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.