05-10-2025 12:00:00 AM
-9వరకు వానలుకురిసే అవకాశం
-పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ. వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హను మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే సోమవారం రాష్ట్ర వ్యాప్తం గా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం 27 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఈనెల 9 వరకు వర్షాలు కురుస్తాయని సూచించింది.