సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
-ఉదండాపూర్ భూ నిర్వాసితులకు రూ.175 కోట్లు మంజూరు
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకంలో భాగంగా ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో భాగంగా ప్రభుత్వము రూ.175 కోట్లు మంజూరు చేసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) తెలిపారు. భూ నిర్వాసితులకు మేలు చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నీడనిచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు సంబంధించి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఈ నిధులను అర్హులైన వారికి ఖర్చు చేయడం జరుగుతుందని తెలియజేశారు.






