07-06-2025 12:00:00 AM
సమ్మర్ క్యాంపు ముగింపులో వక్తలు
ఖైరతాబాద్, జూన్ 6: నగరంలో ఉత్సాహంగా సాగిన వేసవి శిబిరం ముగింపు కా ర్యక్రమం ఖైరతాబాద్ జోన్లో విక్టరీ ప్లే గ్రౌం డ్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ యాదగిరీరావు, కార్పొరేటర్ డాక్టర్ సు రేఖ రాజ్కుమార్ పాల్గొన్నారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు.
‘వేసవి శిబిరాలు పిల్లల సమగ్ర వికాసానికి ఎంతగానో దోహదపడతాయని, కేవలం విద్యాభ్యాసం మాత్ర మే కాకుండా, ఇటువంటి శిబిరాల ద్వారా పిల్లలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు అని చెప్పారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా శిబిరంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో 6 నుంచి 16 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు 43 రోజుల పాటు 457 క్రీడా పోటీలు నిర్వహించగా, 53 వేల మంది పా ల్గొన్నారని వివరించారు. కార్యక్రమంలో జా యింట్ కమిషనర్ వాణిశ్రీ, గేమ్స్ ఇన్స్పెక్టర్ మాధవి, ఏడీ స్పోర్ట్ రహేనా బేగం పాల్గొన్నారు.