10 April, 2026 | 7:25 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

టీ10 లీగ్‌లో శ్రీశాంత్ టీం జోరు

25-11-2025 12:00 AM

అబుదాబీ, నవంబర్ 24 : క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ అబుదాబీ టీ10 లీగ్‌లో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సారథిగా ఉన్న విస్టా రైడర్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈ సీజన్‌లో మ్యా చ్‌లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. విస్టా రైడర్స్, ఆస్పి న్ స్టాలిన్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీశాంత్ జట్టు 6 పరుగుల తేడా తో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన విస్టా రైడర్స్ 84 పరుగులు చేసిం ది. ప్రిటోరియస్ 28, డుప్లెసిస్ 13 రన్స్ చేశారు. ఛేజింగ్‌లో ఈజీగా గెలుస్తుందనుకున్న హర్భజన్‌సింగ్ కెప్టెన్సీలోని స్టాలిన్స్ టీమ్ 78 పరుగులకే పరిమితమైంది. ఓపెనింగ్ ఓవర్ వేసిన శ్రీశాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో విస్టా రైడర్స్‌కు ఇది మూడో విజయం.