07-09-2025 08:35:54 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సంపూర్ణ చంద్రగ్రహణంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఆలయం తిరిగి సోమవారం రోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి ఆలయం తెరవబడడం జరుగుతుందని భక్తులు గమనించాలని చైర్మన్ కొమ్మరెడ్డి నరేష్ రెడ్డి, ఈవో సెల్వాద్రి మోహన్ బాబు తెలిపారు.