07-09-2025 11:00:51 PM
బాన్సువాడ (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కలిశారు. బాన్సువాడ నియోజకవర్గ సమస్యలపై రాజకీయ పరిస్థితులపై స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పోచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.