calender_icon.png 28 June, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం

28-06-2025 12:13:49 AM

మహబూబాబాద్,(విజయ క్రాంతి): ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని, మార్కెట్లో ప్రస్తుతం ఆయిల్ పామ్ పంటకు మంచి డిమాండ్ ఉందని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. శుక్రవారం జిల్లాలోని బయ్యారం మండలం సింగారం, జగ్గు తండా గ్రామాల్లో ఏడిఏ శ్రీనివాసరావు తో కలిసి ఆయిల్ పామ్ పంటలు సాగు చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట - తెలంగాణ రైతుల కల్పతరువు అని చెప్పారు.

ఆయిల్ పామ్ సాగు - ప్రతి రైతు ఇంటింటా సౌభాగ్యంగా నిలుస్తుందని, గడప గడపకు ఆయిల్ పామ్ సాగు మన అందరి కర్తవ్యంగా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఆయిల్ పామ్ పంటతోనే అధిక నూనె దిగుబడి వస్తుందని, నూనె ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించవచ్చని, అంతర పంటలతో మరింత లాభం పొందవచ్చన్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు

జిల్లా కలెక్టర్, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ పంట మార్పిడి ద్వారా నీటి సౌకర్యం ఉన్న ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు  చేయడానికి, పంట మార్పిడి పై అవగాహన చేస్తూ గ్రామ పంచాయతీ స్థాయిలో టామ్ టామ్ ద్వారా, ట్రాక్టర్ లు ఆటో లు, ఇతర వాహనాల ద్వారా  వాయిస్ మెసేజ్ లు రోజు వారీగా ప్లే చేయడం జరుగుతుంది. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు పంట మార్పిడి ఆయిల్ సాగు రాయితీలు ఆహ్వాన పత్రాలు ఇస్తూ అవగాహన చేస్తున్నాము. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ వంద మందికి పైగా రైతులు లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. రైతులు జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేసి లాభాల బాటలో పయనించాలని కోరారు.