calender_icon.png 28 June, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోండి

28-06-2025 12:13:26 AM

ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పణ

రామాయంపేట, జూన్ 27: రామాయంపేట పట్టణంలోని 1597 సర్వే నెంబర్లో బీడీ కార్మికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీడీ కార్మికులు, ముదిరాజ్ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకు వినతిపత్రం సమర్పించారు.

శుక్రవారం ఆయన రామాయంపేటకు వచ్చిన సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే తో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇంటి నిర్మాణం చేపట్టి ఇస్తామని ప్రకటించడంతో అప్పట్లో  శీలం సిద్ధారెడ్డి వద్ద  రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వం నుండి పట్టాలు పొందడం జరిగిందని తెలిపారు.

రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని రికార్డుల నుండి తొలగించకపోవడంతో సిద్ధారెడ్డి తో పాటు అతని కుమారుడు శీలం సుభాష్ రెడ్డి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ వారి నుండి లక్షలాది రూపాయలు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిపారు. దీంతోపాటు పెద్దమ్మ మల్లికార్జున దేవాలయాలకు అమ్మిన భూమిపై కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలనికోరారు.