04-09-2025 12:43:39 AM
అలంపూర్,సెప్టెంబర్ 03:ఈనెల 10న హైద్రాబాద్ లోని రవీంద్ర భారతీలో జరిగే దళిత జర్నలిస్టు ఫోరం 10 వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ పిలుపునిచ్చారు.బుధవారం అలంపూర్ చౌరస్తాలో అందుకు సంబంధించిన ఛలో హైదరాబాద్ పోస్టర్ ను బిఆర్ఎస్ నాయకులు కిషోర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్,దివాకర్ ,జర్నలిస్టులు రంగముని,కురుమన్న, బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.