02-06-2025 01:38:52 AM
కరీంనగర్, జూన్ 1 (విజయక్రాంతి): తె లంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీ స్ పరేడ్ మైదానంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఉద యం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొననున్నారు.
తొలు త తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అ మరవీరులకు నివాళులర్పించి, పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. తెలం గాణ పోరాట యోధులను సన్మానించడంతోపాటు వివిధ పథకాల కింద. లబ్దిదారు లకు చెక్కులను అందజేయనున్నారు. రాజీవ్ యువ వికాస్ లబ్దిదారులకు ఆయన చెక్కు లు పంపిణీ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పోలీస్ పరేడ్ మైదానంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అమెరికా వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ సారి తెలంగాణ ఆవిర్భాన వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికాబాట పట్టారు. సిరిసిల్ల ఎ మ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్ రెడ్డిలతోపాటు పార్టీ నాయకులు చాలామంది వీరివెంట కరలివెళ్లారు. ఆదివారం అక్కడ జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు సోమవారం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు.