26-06-2025 08:12:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారతదేశ భవిష్యత్తు బాగుపడాలంటే యువత దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి(District Judge Srivani) పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. మత్తు పదార్థాల వాడకం వైపు దృష్టి పెట్టకూడదని దానివల్ల అనేక అనర్ధాలు జరుగుతాయన్నారు. ఆరోగ్యం దెబ్బతిని మానసిక ప్రశాంతత ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా సీనియర్ సిటిజన్ ఎంసీ లింగన్న పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.