9 April, 2026 | 5:02 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

షఫాలీకి మొండిచేయి

20-11-2024 12:00 AM
  1. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక 
  2. డిసెంబర్ 5న తొలి వన్డే

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మందితో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతూ వస్తోన్న ఓపెనర్ షఫాలీ వర్మను పక్కనబెట్టింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఈ భారత ఓపెనర్ ఈ ఏడాది ఆరు మ్యాచ్‌ల్లో 108 పరుగులు మాత్రమే చేసింది.

షఫాలీతో పాటు ఉమా చెత్రి, హేమలత, శ్రేయాంక, సయాలీ సత్‌గరేలకు జట్టులో చోటు దక్కలేదు. కివీస్‌తో సిరీస్‌కు దూరమైన హర్లీన్ డియోల్, రిచా ఘోష్, మిన్నూ మాని, టిటాస్ సాధు, ప్రియా పూనియా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. డిసెంబర్ 5న తొలి వన్డే, 8న రెండో వన్డే, 11న మూడో వన్డే జరగనుంది.