11 August, 2026 | 1:46 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

షఫాలీకి మొండిచేయి

20-11-2024 12:00 AM
  1. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక 
  2. డిసెంబర్ 5న తొలి వన్డే

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మందితో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతూ వస్తోన్న ఓపెనర్ షఫాలీ వర్మను పక్కనబెట్టింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఈ భారత ఓపెనర్ ఈ ఏడాది ఆరు మ్యాచ్‌ల్లో 108 పరుగులు మాత్రమే చేసింది.

షఫాలీతో పాటు ఉమా చెత్రి, హేమలత, శ్రేయాంక, సయాలీ సత్‌గరేలకు జట్టులో చోటు దక్కలేదు. కివీస్‌తో సిరీస్‌కు దూరమైన హర్లీన్ డియోల్, రిచా ఘోష్, మిన్నూ మాని, టిటాస్ సాధు, ప్రియా పూనియా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. డిసెంబర్ 5న తొలి వన్డే, 8న రెండో వన్డే, 11న మూడో వన్డే జరగనుంది.