23 June, 2026 | 8:15 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

మైనర్ అమ్మాయిల జోలికి వెళితే.. జైలుకే: సీఐ వెంకట్ రెడ్డి

05-08-2025 12:23 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం, మాయ మాటలు చెప్పి వెంట పడటం, తీసుకెళ్లడం చేస్తున్నారు. ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్లిన, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు అతనికి ఎవరైనా సహకరించినా పోక్సో చట్టం 14 సం"(లేదా) యావజ్జీవ శిక్ష పడుతుందని యువత ఇలాంటి జోలికి వెళ్లి వారి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సీఐ వెంకట్ రెడ్డి కోరారు. అలాగే తల్లి దండ్రులు మైనర్ పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారని, ముఖ్యంగా ఫోన్స్ విషయంలో, ఛాటింగ్ విషయంలో గానీ పిల్లలపై నిఘా ఉంచాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిసై  పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.