13-12-2025 12:39:15 AM
కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్...
కన్నాయిగూడెం,డిసెంబర్12(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నిబంధనలకు పెడితే విరుద్ధంగా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నాయిగూడెం ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర వెంకటేష్ మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలంలో గ్రామపంచాయతీ మూడోవ సాధారణ ఎన్నికలు 2025 నేపథ్యంలో ఎవరైనా ఎన్నికల కోడ్ విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారికిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మండలంలోని 11గ్రామ పంచాయతీలోని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, యువత ఈ విషయాన్ని గమనించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు .కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాల వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టవద్దని సూచించారు.
రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసిన కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకి సహకరించి 17న జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎస్త్స్ర వెంకటేష్ప్రజలనుకోరారు.