16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

గుడుంబా అమ్మే వారిపై కఠిన చర్యలు తప్పవు

11-11-2025 08:44 PM

గుడుంబా విక్రయాలు చేసిన వారిని తహశీల్దార్ ఎదుట బ్యాండవర్ చేసిన పోలీసులు..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ అన్నారు. వారం రోజుల క్రితం గుడుంబా విక్రయాలు చేస్తుండడంతో పోలీసులు రైడ్ చేశారు దోరికిన వ్యక్తుల పేర్లు చిట్టి బత్తుల గట్టమ్మ, తొంగరి సావిత్రి, బత్తిని వెంకటలక్ష్మి, బుద్దే ఇందిరాపైన తెలిపిన వ్యక్తుల వద్ద దాదాపుగా 40 లీటర్ల గుడుంబా పట్టుకోవడం కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

ఇటీవలే కేసు నమోదు చేయబడిన పై వ్యక్తులు మరల గుడుంబా విక్రయిస్తే వారికి ప్రభుత్వం నుంచి రావలసిన బెన్ఫిట్స్ ఏవి కూడా రాకుండా పింఛన్ కట్ చేస్తానని వారికి కన్నాయిగూడెం తహసిల్దారు  హెచ్చరించారు.అదేవిధంగా ఆరు నెలల జైలు శిక్ష ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గుడుంబా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున ఎవరు కూడా చట్టవిరుద్యమైన పనులు చేయకూడదు అని కన్నయగూడెం ఎస్సై ఇనిగల వెంకటేష్ తో పాటు మండల తహసిల్దార్ ఎండి సర్వర్ గ్రామ ప్రజలకు సూచించారు.