25 July, 2026 | 10:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులు

11-11-2025 09:08 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రజా కవి అందెశ్రీకి కరీంనగర్ లోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ మట్టిలోని మాణిక్యం అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి ఒక మహాకవిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాట అయిన జయ జయహో తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించబడిన స్థాయికి ఎదిగిన అందెశ్రీ కి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు.

పేదల కోసం, బడుగుల కోసం, కార్మిక కర్షకుల కోసం, రైతు కూలీల కోసం, పకృతి కోసం, చివరగా తెలంగాణ కోసం గల మెత్తిన మహాకవి అందెశ్రీ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు కడపల విజయకుమార్, పాటకుల భూమయ్య, బోయినపల్లి చంద్రయ్య, గజ్జల ఆనందరావు, పాస్టర్ తిమోతి, ఉరుమల్ల విశ్వం, బూత్కూరి కాంత, సిగిరి శ్రీధర్,  నాయిని  ప్రసాద్, ఎండి రజాక్  తదితరులు పాల్గొన్నారు.