calender_icon.png 31 July, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలి

30-07-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి జులై 29 ( విజయ క్రాంతి ): మెనూ ప్రకారం మంచి రుచికరమైన ఆహారాన్ని  విద్యార్థులకు కడుపు నిండా భోజ నం పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు  యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మద్యా న భోజనం పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం అందించే భోజనాన్ని కలెక్టర్ స్వయం గా పరిశీలించి విద్యార్థులకు భోజనం వడ్డించారు.

ఈరోజు పాఠశాలకు ఎంతమంది విద్యా ర్థులు వచ్చారని, వారందరికీ సరిపోను భోజనం వంట చేశారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధముగా బోధించి వెనకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులను చదివించి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతం పొందేలా కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల సిబ్బంది ఉన్నారు.