17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి ఎస్సై అజయ్ కుమార్

02-01-2026 10:09 PM

మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎస్సై అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడటం వల్ల మృత్యువాత పడి చాలా కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయని వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా డిఫెన్స్ గా డ్రైవింగ్ చేయాలని సూచించారు.

బైక్ పై వెళ్లేవాళ్లు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, కారులో వెళ్లేవాళ్లు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని, ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించొద్దని అధిక వేగంతో వెళ్ళవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని నిబంధనలను ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యనికి చేర్చడం వాహన డ్రైవర్ బాధ్యత అని తెలిపారు.